VVS Laxman : నాగ్పూర్ టెస్టులో టీమిండియా విజయంపై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశాడు. ‘బోర్డర్ – గవాస్కర్ సిరీస్ కోసం భారత్ సన్నద్ధమైన తీరు చాలా నచ్చింది. తొలి టెస్టులో అద్భుతంగా ఆడిన టీమిండియా పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శించింది’ అని లక్ష్మణ్ అన్నాడు. బ్యాటింగ్లో అదరగొట్టిన ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్పై ప్రశంసలు కురింపాడు. ‘రోహిత్ శర్మ సెంచరీ బాది జట్టును ముందుండి నడిపించాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్.. ఇద్దరూ గుర్తుండిపోయే అల్రౌండ్ ప్రదర్శన చేశారు. బౌలర్లు అందరూ తమ నైపుణ్యం చూపించారు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఇది మంచి ఆరంభం’ అని ఈ మాజీ క్రికెటర్ తన ట్వీట్లో రాసుకొచ్చాడు.
ఆసీస్పై లక్ష్మణ్కు మంచి రికార్డు ఉంది. 2001లో ఈడెన్ గార్డెన్స్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్లో లక్ష్మణ్ 281 పరుగులు చేశాడు. దాంతో, ఇండియా 171 రన్స్తో మ్యాచ్ గెలిచింది. ఆస్ట్రేలియాపై అతను ఆడిన ఇన్నింగ్స్ను అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరు. అప్పటి నుంచి వీవీఎస్ లక్ష్మణ్ను అందరూ వెరీ స్పెషల్ లక్ష్మణ్ అని పిలవడం మొదలు పెట్టారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే భారత జట్టు బోర్డర్ – గవాస్కర్ సిరీస్ తప్పక గెలవాలి. ఎంతో కీలకమైన ఈ సిరీస్లో ఇండియా అదర గొట్టింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్ 132 రన్స్తో ఓడించింది. రోహిత్ శర్మ సెంచరీతో మెరిశాడు. జడేజా, అక్షర్ పటేల్ అర్థ శతకాలు సాధించారు. ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా 7, అశ్విన్ 8 వికెట్లు తీసి ఆసీస్ జట్టును దెబ్బతీశారు. తొలి టెస్టు విజయంతో నాలుగు టెస్టుల సిరీస్లో ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Loved the way India prepared for this series and this is called proper domination. Rohit leading from the front with a brilliant 💯. Jaddu and Axar putting in memorable all-round performances and all the bowlers showing their skills. Congratulations @BCCI ,Great start to #BGT2023 pic.twitter.com/zGupQNVJWF
— VVS Laxman (@VVSLaxman281) February 11, 2023