Virender Sehwag | భారత్ వేదికగా ఐసీసీ వరల్డ్ కప్ జరుగనున్నది. స్వదేశంలో జరిగే ప్రపంచకప్ను రోహిత్ సేన నెగ్గాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక తుదిజట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే విషయం సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. మిడిలార్డర్లో ప్లేయర్ల మధ్య గట్టి పోటీ నెలకొన్నది. మరో వైపు తుది జట్టు ఎంపిక సైతం మేనేజ్మెంట్కు పెద్ద సవాల్గానే మారింది. ఈ క్రమంలో భారత జట్టు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
సూర్యకుమార్ యాదవ్కు ప్లేయింగ్ లెవెన్లో చోటు దక్కుతుందా? లేదా తేల్చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఇటీవల ఇండోర్లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 37 బంతుల్లో 72 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో బ్యాక్టు బ్యాక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. రాజ్కోట్లో జరిగిన మూడో మ్యాచ్లో ఒటమితో టీమిండియా 2-1 ఆధిక్యంతో సిరీస్ను సొంతం చేసుకున్నారు. అయితే, మిడిలార్డర్లో సూర్యకుమార్ తీవ్ర పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇటీవల జరిగిన ఆసియా కప్, ఆస్ట్రేలియా సిరీస్లో కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ అత్యుత్తమ ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. మరో వైపు ఇషాన్ కిషన్ సైతం ఆసియా కప్తో పాటు ఇండోర్ వన్డేలోనూ తక్కువ బంతులే ఆడినా.. మంచి స్కోరు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా ప్లేయింగ్ లెవెన్ జట్టుపై ఓ ఇంటర్వ్యూలో సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇండోర్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 105 పరుగులతో అయ్యర్ నాలుగో నంబర్ స్థానంలో చోటు దక్కించుకున్నాడని సెహ్వాగ్ తెలిపాడు.
కేఎల్ రాహుల్ 6 ప్లేస్, 7 నెంబర్ ప్లేస్లో ఆడుతారని.. ఈ రెండు స్థానాల్లో సూర్యకుమార్కు చోటు దక్కే పరిస్థితి లేదన్నాడు. ఐదోస్థానం ఉంటుందని.. కానీ.. హార్దిక్ పాండ్యా ఆరో బౌలర్ అయితే రాహుల్ ఐదు, హార్దిక్ ఆరోస్థానంలో ఆడతారని.. ఆ తర్వాత బౌలర్లు ఉంటారని సెహ్వాగ్ తెలిపాడు. ఇప్పటి వరకు ఇషాన్ కిషన్ ఏదో స్థానంలో ఉంటాడని అనుకున్నా.. శ్రేయాస్ అయ్యర్ సెంచరీ తర్వాత ఈ ఆశలు గల్లంతయ్యాయని చెప్పాడు. శ్రేయాస్ అయ్యర్ నెంబర్ 4, రాహుల్ 5, హార్ధిక్ ఆరు స్థానాల్లో వచ్చే అవకాశం ఉంటుందని సెహ్వాగ్ క్లారిటీ ఇచ్చాడు.
అయితే, హార్దిక్ ప్యాండా పది ఓవర్ల కోటాను పూర్తి చేయగలడా? లేదా అన్నది చూడాలని టీమ్ చూడాలని మాజీ డ్యాషింగ్ బ్యాట్మెన్ తెలిపాడు. పది ఓవర్లు వేస్తే.. అదనపు బౌలర్ అవుతాడని.. ఈ సమయంలో మరో స్థానంలో సూర్యకుమార్ కంటే.. లెఫ్ట్ హ్యాండర్ అయిన ఇషాన్ కిషన్ను ఆడించడం మేలని సూర్యకుమార్ సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవ్ ఇంకా తన సామర్థ్యం చూపించలేదని పేర్కొన్నాడు.
రెండు సన్నాహక మ్యాచ్లలో అవకాశం లభిస్తే.. తనను తాను నిరూపించుకునేందుకు సూర్య భారీ సెంచరీ సాధించాలని చెప్పాడు. ‘వన్డే క్రికెట్లో సూర్యకుమార్ పెద్దగా చేసింది ఏమీ లేదు’ అని పేర్కొన్నాడు. చివరి 15-20 ఓవర్లలో మాత్రమే బ్యాటింగ్ చేస్తాడని సెహ్వాగ్ తెలిపాడు. హార్దిక్, ఇషాన్, రాహుల్ అందరూ ఇదే చేయగలరని పేర్కొన్నాడు. నెంబర్ 4లో అయ్యర్ ఎంపిక ఖరారైనట్లేనని.. ఈ స్థానం కోసం సూర్యకుమార్ వేచి చూడాల్సిందేనన్నాడు. అవకాశం వస్తే భారీ సెంచరీ సాధించి.. తనను తాను నిరూపించుకోవాలని వివరించారు.