ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. అయితే రెండో టీ20 నుంచి రెగ్యులర్ ఆటగాళ్లు కోహ్లీ, పంత్, జడేజా కూడా జట్టుతో చేరనున్నారు. అదే సమయంలో వీరి గైర్హాజరీలో జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు కూడా అద్భుతంగా ఆడటంతో.. జట్టు సెలెక్షన్ పెద్ద తలనొప్పిగా మారింది.
ఇలాంటి సమయంలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ కనుక జట్టుతో చేరితే అతను ఓపెనర్గా రావాలని స్వాన్ సూచించాడు. రోహిత్, కోహ్లీ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం అందిస్తే.. ఆ తర్వాత హుడా, సూర్యకుమార్ వచ్చి మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుందని స్వాన్ సూచించాడు.
తానైతే అదే నిర్ణయం తీసుకుంటానని చెప్పిన ఈ లెజెండరీ స్పిన్నర్.. కానీ భారత జట్టు సెలెక్షన్తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ నవ్వేశాడు. గతేడాది ఇంగ్లండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేసిన కోహ్లీ 52 బంతుల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు.
వీళ్లిద్దరూ సూపర్ ఆరంభం అందించడంతో భారత జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 224 పరుగులు చేసిందా మ్యాచ్లో. కాబట్టి కోహ్లీని ఇషాన్ కిషన్ స్థానంలో ఓపెనింగ్ పంపించాలని స్వాన్ సలహా ఇస్తున్నాడు.