నెల రోజులపైగా గ్యాప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 35 పరుగులు చేశాడు. కొందరు ఈ ఇన్నింగ్స్పై విమర్శలు చేస్తుండగా.. టీమిండియా మాజీ లెజెండ్ వసీం జాఫర్ మాత్రం కోహ్లీ ఇన్నింగ్స్ను మెచ్చుకున్నాడు. 148 పరుగు లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది.
ఒక్క పరుగు కూడా చెయ్యకుండానే కేఎల్ రాహుల్ (0) వెనుతిరిగాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ బ్యాటింగ్ కష్టంగా ఉన్న పిచ్పై మరో వికెట్ పడకుండా ఆడాడు. ఇదే విషయాన్ని గుర్తుచేసిన జాఫర్.. ‘‘148 పరుగుల ఛేజ్లో మరీ దారుణంగా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలితే తప్ప.. ఏ జట్టయినా గెలుస్తుంది. అలాంటప్పుడు కోహ్లీ చేసిన పరుగులు చాలా విలువైనవి.
బ్రేక్ తర్వాత ఆడుతూ.. ఈ ఇన్నింగ్స్ ఆడటం ఆశలు రేపుతుంది. మామూలుగా ఇలాంటి ఛేజ్లో కోహ్లీ నుంచి 60-70 పరుగులు ఆశిస్తాం. పాక్పై అతని రికార్డు అలాంటిది మరి. కానీ ఇప్పుడు అతను ఆడిన ఇన్నింగ్స్ కూడా విలువైనదే’’ అని స్పష్టం చేశాడు. కోహ్లీ కూడా తొలి బంతికే స్లిప్స్లో క్యాచ్ ఇచ్చాడు. అయితే ఫఖర్ జమాన్ దాన్ని అందుకోలేకపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆడిన కోహ్లీ.. మహమ్మద్ నవాజ్ వేసిన బంతికి లాంగాఫ్లో ఇఫ్తికార్ అహ్మద్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.