ఆసియా కప్లో భాగంగా పాక్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు మిడిలార్డర్ విఫలమైంది. ఒక్కరంటే ఒక్కరు కూడా మరో ఎండ్లో ఉన్న కోహ్లీకి అండగా నిలవలేకపోయారు. ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో కోహ్లీ కూడా చెప్పాడు. భారత జట్టు కొత్తగా ఎంచుకున్న అఫెన్సివ్ విధానం తనకు కూడా నచ్చిందని, దీని వల్ల మిడిల్ ఓవర్లలో రన్ రేట్ మెరుగైందని చెప్పాడు.
గతంలో కూడా ఈ విషయంపై ఫోకస్ చేయాలని చాలాసార్లు అనుకున్నామని వివరించాడు. ‘‘ఈ కొత్త విధానం మేం కోరుకున్న ఫలితాలను ఇచ్చింది. కానీ కొన్నిసార్లు అనుకున్నది అనుకున్నట్లు జరగదు. మిడిల్ ఓవర్లలో మేం కొన్ని కీలక వికెట్లు కోల్పోయాం. దీంతో గేమ్ను 200 టార్గెట్కు తీసుకెళ్లలేకపోయాం. నేను, హుడా ఆ తర్వాత ఉంది బౌలర్లే. ఆ సమయంలో వికెట్లు ఉండుంటే మరిన్ని పరుగులు చేసేవాళ్లం’’ అని కోహ్లీ వివరించాడు.
తను కూడా భారీ షాట్లు ఆడాలని నిర్ణయించుకున్నానని, కానీ వికెట్లు పోవడంతో కమ్యూనికేషన్ వచ్చిందని, ప్లాన్లు మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. మిడిలార్డర్ వికెట్లు పోవడంతో ఒక ఎండ్లో తను చివరి వరకు నిలబడాల్సి వచ్చిందని, దాంతో రిస్కులు తీసుకోలేదని తెలిపాడు.