Virat Kohli : భారత జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) క్రికెట్లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. దిగ్గజాలచే ప్రశంసలందుకున్న అతను టెస్టు చాంపియన్షిప్(WTC)లో తన రికార్డు నిలబెట్టుకున్నాడు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ప్రస్తుతం ఈ చేజ్ మాస్టర్ ఖాతాలో 1,817 పరుగులు ఉన్నాయి.
ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో రోహత్ శర్మ (RohitSharma) కోహ్లీని అధిగమించాడు. 1,809 పరుగులతో కోహ్లీ (1,803) రికార్డు బద్దలు కొట్టాడు. కానీ, అతను 15 రన్స్ వద్ద కమిన్స్ ఓవర్లో ఎల్బీగా ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ 14 పరుగులు కొట్టి హిట్మ్యాన్ను అధిగమించాడు. రోహిత్ శర్మ(15), శుభ్మన్ గిల్(13), పూజారా(14) వెంట వెంటనే ఔట్ కావడంతో కోహ్లీ, రహానేతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాలనుకున్నాడు. కానీ, అనూహ్యంగా అతను స్టార్క్ ఓవర్లో ఔటయ్యాడు. స్లిప్లో స్మిత్ పైకి ఎగిరి క్యాచ్ పట్టడంతో కోహ్లీ నిరాశగా పెవిలియన్ చేరాడు.