కివీస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సారధి విరాట్ కోహ్లీ.. 36 పరుగులకే అవుటయ్యాడు. న్యూజిల్యాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర వేసిన ఇన్నింగ్స్ 63వ ఓవర్లో కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ ఓవర్ తొలి బంతినే కట్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆ బంతి స్లో బౌన్స్ కోహ్లీ అంచనాను దెబ్బతీసింది.
దీంతో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బాల్.. వికెట్లను పడగొట్టింది. ఇలా అవుటైన వెంటనే కోహ్లీ తొలుత బాధపడ్డాడు, ఆ వెంటనే ఆశ్చర్యపోయాడు. ఇలా కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కోహ్లీ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవుట్లో బంతి కోహ్లీ బ్యాట్ను తాకినట్లు కనిపించింది.
కానీ ముందుగా ఆ బంతి బ్యాటును తాకిందా? లేక ప్యాడ్ను తాకిందా? తెలియడం లేదని థర్డ్ అంపైర్ వీరేందర్ శర్మ అభిప్రాయపడ్డాడు. దీంతో కోహ్లీని అవుట్గా ప్రకటించారు. ఈ నిర్ణయంపై పలువురు మాజీలు కూడా పెదవి విరిచారు. అంపైరింగ్ చాలా దరిద్రంగా ఉందంటూ అభిమానులు తిట్టిపోశారు.