Virat Kohli | న్యూఢిల్లీ: వెస్టిండీస్ పర్యటనలో తన బాధ్యతలు ముగించుకున్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. స్వదేశానికి చేరుకున్నాడు. రెండో టెస్టులో సెంచరీతో రాణించిన కోహ్లీ.. వన్డే సిరీస్లో బ్యాటింగ్కే దిగలేదు. ఇక టీ20 సిరీస్ నుంచి విరాట్తో పాటు రోహిత్ శర్మకు సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు.
దీంతో ఆసియా కప్ ప్రారంభానికి ముందు కోహ్లీ.. వెస్టిండీస్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి వచ్చాడు. విండీస్ పర్యటనలో మన ఆటగాళ్లు విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో కోహ్లీ కోసం ‘గ్లోబల్ ఎయిర్ చార్టర్ సర్వీసెస్’ ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అవి వైరల్గా మారాయి.