WTC Final 2023 : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు కష్టాల్లో పడింది. ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ(14) ఔటయ్యాడు. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ లైన్ అండ్ లెంగ్తో బంతిని ఆడిన కోహ్లీ, స్లిప్లో స్టీవ్ స్మిత్ చేతికి చిక్కాడు. దాంతో, టీమిండియా స్వల్ప వ్యవధిలో నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయింది. టెస్టు జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చిన అజింక్యా రహానే(13), ఆల్రౌండర్ రవీంద్ర జేడాజా(8) క్రీజులో ఉన్నారు. 21 ఓవర్లకు భారత జట్టు స్కోర్.. 83/4. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఇంకా 386 పరుగులు వెనకబడి ఉంది.
తొలి ఇన్నింగ్స్లో భారత్కు శుభారంభం దక్కలేదు. ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్లు రోహిత్ శర్మ(15)ను కమిన్స్ ఎల్బీగా వెనక్కి పంపాడు. స్కాట్ బోలాండ్ ఆ తర్వాతి ఓవర్లో ఐపీఎల్ సెంచరీ హీరో శుభ్మన్ గిల్(13) ను ఔట్ చేశాడు. బోలాండ్ ఓవర్లో బంతిని వదిలేసిన గిల్ బౌల్డ్ అయ్యాడు. అనూహ్యంగి స్వింగ్ అయిన బంతి ఆఫ్ స్టంప్ను ఎగరగొట్టింది. దాంతో, 30 పరుగుల వద్ద టీమిండియా రెండు ప్రధాన వికెట్లు కోల్పోయింది.