నెలరోజులపైగా క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్న స్టార్ బ్యాటర్ కోహ్లీ.. ఆసియా కప్లో పునరాగమనం చేశాడు. పాకిస్తాన్తో తొలి మ్యాచ్లో 35 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హాంగ్కాంగ్పై అర్ధశతకం (59 నాటౌట్) సాధించాడు. అయితే అతని ఆటలో మునుపటి ఫ్లూయెన్సీ కనిపించడం లేదని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.
కోహ్లీ ఆడేసమయంలో అవతలి బ్యాటర్ కనీసం 140-150 స్ట్రైక్రేట్తో ఆడాలని, లేదంటే భారత జట్టు కష్టాల్లో పడుతుందని చెప్పాడు. హాంగ్కాంగ్తో మ్యాచ్లో సూర్యకుమార్ (24 బంతుల్లో 68 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడకపోతే భారత జట్టు కేవలం 150-160 పరుగులే చేసి ఉండేదని, అది చాలా డేంజర్గా మారేదని వివరించాడు.
ఆసియా కప్లో స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా నిరాశ పరిచాడు. పాకిస్తాన్ మ్యాచ్లో తొలి బంతికే గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. హాంగ్కాంగ్తో జరిగిన మ్యాచ్లో 39 బంతుల్లో 36 పరుగులు చేశాడు. టీ20ల్లో ఇంత దారుణమైన స్ట్రైక్రేటుతో రాహుల్ ఇంతకు ముందు ఎన్నడూ ఆడకపోవడం గమనార్హం.