Virat Kohli: టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీకి రికార్డులు కొత్తేం కాదు. తన సుదీర్ఘ కెరీర్లో మరెవరికీ సాధ్యంకాని రికార్డులు సొంతం చేసుకున్న ఈ పరుగుల యంత్రం.. అఫ్గానిస్తాన్తో సిరీస్లో మరో అరుదైన రికార్డుకు చేరువకాబోతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో టీ20లు, లీగ్లలో ఆడుతూ అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లలో భారత్ నుంచి 12వేల పరుగుల మైలురాయిని చేరుకోబోతున్నాడు. మరో 35 పరుగులు చేస్తే అతడు ఈ ఘనతను దక్కించుకుంటాడు.
35 ఏండ్ల ఈ ఢిల్లీ బ్యాటర్.. టీ20, ఐపీఎల్లో కలిపి ఇప్పటివరకూ 374 మ్యాచ్లలో 11,965 పరుగులు సాధించాడు. భారత్ నుంచి ఇన్ని పరుగులు చేసిన బ్యాటర్ కూడా అతడొక్కడే. పొట్టి క్రికెట్లో అత్యధికంగా పరుగులు చేసిన క్రికెటర్లలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ (14,562) అగ్రస్థానంలో ఉండగా పాకిస్తాన్ బ్యాటర్ షోయభ్ మాలిక్ (12,993) రెండోస్థానంలో ఉన్నాడు. విండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ (11,965) మూడో స్థానంలో ఉండగా కోహ్లీ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు.
Rohit Sharma just 18 Sixes away to becomes first player to hits 200 Sixes in T20I Internationals history.
– THE HITMAN…!!!! pic.twitter.com/xTosZnhCSC
— CricketMAN2 (@ImTanujSingh) January 9, 2024
రోహిత్ కోసం ఓ రికార్డు..
ఈ జాబితాలో భారత్ నుంచి కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్.. 423 మ్యాచ్లలో 11,035 పరుగులు చేశాడు. పొట్టి క్రికెట్లో రోహిత్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. గేల్, మాలిక్, పొలార్డ్, కోహ్లీ, హేల్స్, డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్లు రోహిత్ కంటే ముందున్నారు. రోహిత్ శర్మ గనక వచ్చే అఫ్గాన్ సిరీస్లో 18 సిక్సర్లు బాదితే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 200 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్గా రికార్డులకెక్కుతాడు.