టీమిండియా స్టా్ర్ క్రికెటర్ కోహ్లీ గురించి మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ కొత్త అంచనా వేశాడు. టీ20 ప్రపంచకప్ సన్నాహకంగా భావించే ఆసియా కప్లో కోహ్లీని ఓపెనర్గా చూస్తామేమో? అని పార్థివ్ అన్నాడు. కోహ్లీ సామర్థ్యంపై ఎలాంటి అనుమానాలూ అక్కర్లేదని, ప్రస్తుతం కేవలం అతని ఫామ్, ఏ స్థానంలో కోహ్లీని ఆడించాలనే విషయాలపైనే ఆలోచించాలని సూచించాడు.
దీనికోసం ఆసియా కప్ చాలా కీలకం కానుందన్నాడు. కేవలం కోహ్లీకే కాకుండా, భారత జట్టుకు కూడా ఈ సిరీస్ కీలకమని చెప్పాడు. కేఎల్ రాహుల్ ఫిట్గా లేని కారణంగా ఆసియా కప్లో కోహ్లీ ఓపెనింగ్ చేసినా ఆశ్చర్యం లేదని పార్థివ్ వివరించాడు.
‘‘ఆసియా కప్ నుంచి తను అందుబాటులో ఉంటానని కోహ్లీ చెప్పాడు. అలాగే ప్రస్తుతం టీమిండియా చాలా మంది ఓపెనర్లను కూడా ట్రై చేస్తోంది. ఆర్సీబీ తరఫున కోహ్లీ చాలాసార్లు ఓపెనింగ్ చేశాడు’’ అని చెప్పాడు. ఇంగ్లండ్ పర్యటనలో కూడా కోహ్లీ విఫలం అవడంతో విండీస్ వన్డేలు, టీ20 సిరీస్లలో కోహ్లీవి విశ్రాంతినిచ్చారు.
తాజాగా జింబాబ్వే సిరీస్లో కూడా కోహ్లీ ఆడటం లేదు. ఆసియా కప్ నుంచి ఈ స్టార్ ఆటగాడు అందుబాటులో ఉంటాడని ఆ తర్వాత బీసీసీఐ వెల్లడించింది. ఆసియా కప్ నుంచి టీ20 ప్రపంచకప్ వరకు టీమిండియా వెటరన్లకు రెస్ట్ దొరకదని, అందుకే విండీస్ జింబాబ్వే పర్యటనల్లో సీనియర్లకు విశ్రాంతి ఇచ్చామని బీసీసీఐ తెలిపింది. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే ఆసియా కప్లో కోహ్లీ ఏ స్థానంలో బ్యాటింగ్కు వస్తాడో చూడాలి.