Virat Kohli : భారత జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli)కి రికార్డులు కొత్త కాదు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారిచండం అతడికి వెన్నతో పెట్టిన విద్య. అందుకనే అనతి కాలంలోనే ప్రపంచంలోని మేటి ఆటగాళ్లలో ఒకడిగా పేరొందాడు. ఈ రికార్డుల రారాజు ఈరోజుతో టెస్టుల్లో(Test Cricket) పుష్కర కాలం పూర్తి చేసుకున్నాడు. అవును.. అతను టెస్టుల్లో ఆరంగ్రేటం చేసి నేటికి పన్నెండేళ్లు. 2011 జూన్ 20 రోజున విరాట్ టెస్టు జెర్సీ ధరించాడు. అతను వెస్టిండీస్(Westindies) జట్టుపై మొదటి మ్యాచ్ ఆడాడు.
నాలుగో స్థానంలో బరిలోకి దిగిన అతను రెండు ఇన్నింగ్స్ల్లో కోహ్లీ 4, 15 పరుగులు చేశాడంతే. ఈ సందర్భాన్ని తలచుకుంటూ విరాట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. ‘ఈ రోజుతో టెస్టు కెరీర్కు 12 ఏళ్లు. భారత జట్టుకు ఆడడాన్ని ఎప్పుడు గర్వంగా భావిస్తా’ అని పోస్ట్ రాశాడు.
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కోహ్లీ 2012లో ఆసీస్పై ఆడిలైడ్లో మొదటి టెస్టు శతకం(112) సాధించాడు. ఇప్పటివరకు అతను 109 టెస్టులు ఆడిన అతను 8,479 రన్స్ కొట్టాడు. అతడి ఖాతాలో 28 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అండర్ -19 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు కెప్టెన్ అయిన కోహ్లీ మ్యాచ్ విన్నర్గా పేరొందాడు. నిలకడగా రాణిస్తూ ఛేజ్ మాస్టర్గా, సచిన్(Sachin Tendulkar) వారసుడిగా మాజీలచే కితాబు అందుకున్నాడు. ఈ క్రమలోనే మమహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) నుంచి 2014లో కోహ్లీ టెస్టు పగ్గాలు అందుకున్నాడు. అతన దూకుడు స్వభావంతో టీమిండియాను నంబర్ 1 జట్టుగా నిలిపాడు. అంతేకాదు ఐసీసీ తొలిసారి నిర్వహించిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేర్చాడు. అయితే.. ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు అనూహ్యంగా ఓడిపోయింది. రెండోసారి డబ్ల్యూటీసీ చేరినా ఫలితం మారలేదు. ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో రోహిత్ శర్మ సేనపై గెలిచి టెస్టు గదను సొంతం చేసుకుంది.