Virat Kohli | టీ20 ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన ఇస్తున్న విరాట్ కోహ్లీ.. మరో మైలురాయి దాటాడు. మెగా టోర్నీలో సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఇటీవల అక్టోబర్ నెలకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును సొంతం చేసుకున్న ఈ రన్ మెషీన్.. తాజాగా టీ20ల్లో 4008 పరుగులు చేసిన మొదటి క్రికెటర్గా నిలిచి రికార్డు సృష్టించాడు. ఇంగ్లాడ్తో జరుగుతున్న సెమీ ఫైనల్ పోరులో విరాట్.. ఈ ఘనత సాధించడం విశేషం.
ఇటీవల పాకిస్థాన్తో జరిగిన పోరులో వీరోచితన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ.. 53 బంతుల్లో 82 పరుగుల చేసి నాటౌట్గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఇంగ్లాడ్తో జరుగుతున్న మ్యాచ్లో ఆఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇక కోహ్లీ.. ఇప్పటి వరకు ఆడిన టీ20 వరల్డ్ కప్లో ఆరు మ్యాచుల్లో 98.67 సగటు.. 136.41 స్ట్రైక్ రేట్తో మొత్తం 296 రన్స్ చేశాడు. విరాట్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 3,853 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు.న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్తిల్ 3,531, పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ 3,323 రన్స్తో తర్వాతి స్థానాల్లో నిలిచారు.
VIRAT KOHLI 👑
He becomes the first player to cross 4⃣0⃣0⃣0⃣ T20I runs!#T20WorldCup | #INDvENG | 📝: https://t.co/PgKzpNaatB pic.twitter.com/F4v9ppWfVo
— ICC (@ICC) November 10, 2022