Vinesh Phogat : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్(Vinesh Phogat) మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) చీఫ్ తనను ఒలింపిక్స్ క్వాలిఫయర్స్(Olympics Qulaifiers)లో పోటీ పడకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఫోగట్ అంది. అయితే.. ఆమె వ్యాఖ్యల్ని డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ 2019, 2022లో జరిగిన కొట్టిపారేశాడు.
‘నేను ఒలింపిక్స్ క్వాలిఫయర్స్లో పోటీ పడకుండా చూసేందుకు డబ్ల్యూఎఫ్ఐ చీప్ సంజన్ సింగ్(Sanjay Singh) అన్నివిధాల ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే నా సహాయక సిబ్బందికి అవసరమైన వస్తువుల్ని ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారు. అంతేకాదు డోపింగ్ కేసులో నన్ను ఇరికిస్తారనే భయం వెంటాడుతుంది’ అని ఫోగట్ ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే.. రెజ్లింగ్ ఫెడరేషన్ మాత్రం ఫోగట్ వార్తల్లో నిజం లేదని, మార్చి 11న చివరి తేదీ కాగా ఆమె ఆలస్యంగా మార్చి 18వ తేదీన దరఖాస్తు చేసిందని తెలిపింది. అప్పటికే తాము ఆటగాళ్లు, వాళ్ల సహాయక సిబ్బంది వివరాలను పంపించామని చెప్పింది. ఏప్రిల్ మూడో వారంలో కిర్గిస్థాన్ వేదికగా ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ జరుగునున్నాయి.
వరల్డ్ చాంపియన్షిప్స్(2019, 2022)లో ఫోగట్ 53 కిలోల విభాగంలో కాంస్య పతకంతో మెరిసింది. అంతేకాదు 2018 ఆసియా క్రీడల్లో 50 కిలోల విభాగంలో పోటీపడిన ఆమె ఏకంగా స్వర్ణ పతకం కొల్లగొట్టింది. మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న అప్పటి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్(Brij Bhushan)కు వ్యతిరేకంగా వినేశ్ ఫోగట్ పెద్ద ఉద్యమమే చేసింది. అతడిని పదవి నుంచి తప్పించడతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని భజ్రంగ్ పూనియా, సాక్షి మాలిక్ వంటి స్టార్ రెజ్లర్లతో పాటు ఫోగట్ ఉద్యమించిన విషయం తెలిసిందే.