హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ(Congress party) తీరుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga) ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలను అణగదొక్కుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections) కాంగ్రెస్ పార్టీ నుంచి మాదిగలు ఎందుకు ప్రాతినిధ్యం వహించటం లేదని ప్రశ్నించారు.
మోత్కుపల్లి నరసింహులుకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు? బాబు జగ్జీవన్ రామ్ భవనం ప్రారంభోత్సవానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఎందుకు ఆహ్వానించలేదని సూటిగా ప్రశ్నించారు. ఈ మూడింటికి కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ముస్లిం ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లింగా కనీసం మంత్రి కూడా లేడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంకో 10 ఏండ్లు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటాడన్న షబ్బీర్ అలీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక ముస్లిం అయ్యుండి మంత్రివర్గంలో నలుగురు రెడ్లకు అవకాశం ఇచ్చి ఒక ముస్లింకి అవకాశం ఇవ్వకపోతే అడిగేది పోయి ఇలా మాట్లాడటం ఏమిటన్నారు. షబ్బీర్ అలీ నువ్వు ప్రభుత్వ సలహాదారుడివి సలహాలు ఇవ్వు, పొగడకు అని సూచించారు.