ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్మీ అధికారి ఇంటిపై ఆ దేశ పోలీసులు రైడ్ చేశారు. దీనిపై ఆగ్రహించిన పాక్ సైనికులు ఆ పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. రైడ్ చేసిన పోలీసులను కొట్టడంతోపాటు చిత్రహింసలకు గురి చేశారు. (Pak Soldiers Thrash Cops) ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఈ సంఘటన జరిగింది. బహవల్నగర్లోని పోలీస్ స్టేషన్కు చెందిన పోలీసులు ముగ్గురు పౌరులను అక్రమంగా నిర్బంధించారు. వారిని విడుదల చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. ముగ్గురు వ్యక్తులకు చెందిన సహచరుడ్ని అరెస్ట్ చేసేందుకు ఆర్మీ అధికారి నివాసంపై రైడ్ చేశారు.
కాగా, ఈ సంఘటనపై పాక్ సైనికులు ఆగ్రహంతో రగిలిపోయారు. సోమవారం బహవల్నగర్లోని మదర్సా పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. పోలీసులు నిర్బంధించిన ముగ్గురు వ్యక్తులను విడిపించారు. ఈ సందర్భంగా నలుగురు పోలీసులను దారుణంగా కొట్టారు. పాక్ సైనికులు వారిని చిత్రహింసలకు గురి చేశారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పాక్ ఆర్మీపై విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు ముగ్గురు వ్యక్తులను అక్రమంగా నిర్బంధించి, వారి నుంచి డబ్బు డిమాండ్ చేసిన పోలీసులపై పంజాబ్ పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. పాక్ సైనికుల చేతిలో చిత్రహింసలకు గురైన నలుగురు పోలీసులు అబ్బాస్ రిజ్వాన్, ముహమ్మద్ నయీమ్, ముహమ్మద్ ఇక్బాల్, అలీ రజాను సస్పెండ్ చేయడంతోపాటు వారిని అరెస్ట్ చేశారు. పాక్ ఆర్మీ, పంజాబ్ పోలీస్ మధ్య విభేదాలున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నదని పోలీస్ అధికారులు ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించుకున్నట్లు పేర్కొన్నారు.
Those who criticize the army day and night, If there was no Pakistan Army today Who would take off their pants in front of a powerful army and who will conquer Bahawalnagar Police Station? pic.twitter.com/HvdAZTE6et
— Brahag Baloch (@zzbaloch) April 11, 2024
Pakarmy beat up police officials in #Bahawalnagar after a dispute over illegal weapon recovery frm one of the family members of a soldier.
The unchecked power & lawlessness of Pak mil is glaring once more. It's a stark reminder of ongoing challenges to 🥰 pic.twitter.com/9i0GDarYqu
— Ehsaan Khan (@EhsaanK58262744) April 11, 2024