అమరావతి: కరోనా నేపథ్యంలో టీడీపీ మహానాడు కార్యక్రమం వర్చువల్ విధానంలో కొనసాగుతోంది. మహానాడులో టీడీపీ తీర్మానాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘మహానాడులో అరిగిపోయిన పాత రికార్డులు అపి ఏదైనా పనికొచ్చే పనిచేయి బాబు. నీతో పొత్తు పెట్టుకుని వెన్నుపోటు పొడిపించుకునే పార్టీనో, మనిషినో చుస్కో. కొత్తవారు దొరక్కపోతే పాత వారినే మళ్ళీ పొడువు. ఎంతకాలం హైదరాబాద్ నేనే కట్టాను, అమరావతి గ్రాఫిక్స్ చూపించాను అంటావ్? మహానాడు మొదటి రోజే బంపర్ ఆఫర్ తగిలింది బాబుకి. ఓటుకు కోట్లు కేసులో ‘మన వాళ్లు బ్రీఫుడ్ మీ’ అన్న స్వరం ఆయనదేనని ఫోరెన్సిక్ ల్యాబులు ఇచ్చిన రిపోర్టును ఈడీ ఛార్జిషీటులో జతపర్చింది. మళ్లీ స్టే కోసం పరుగెడతాడేమో. అత్యధిక స్టేలు పొందిన తుప్పు రికార్డు నీ పేరనే ఉంది బాబూ.’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
‘ఎన్టీఆర్ ను పొగుడుతున్నారో హేళన చేస్తున్నారో తెలియనంత అమాయకులేం కాదు జనం. ఏటా రెండుసార్లు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం 20 ఏళ్లుగా జరుగుతోంది. ఇప్పుడు పుస్తకాలు రాస్తారంట. ఎన్నికల ముందు బాలయ్య నటించిన రెండు సినిమాల్లో ఎన్టీఆర్ కంటే బాబునే యుగపురుషుడిగా ఎలివేషన్ ఇచ్చారని’ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.