వడోదరా: 72వ జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్షిప్లో ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. గురువారం జరిగిన క్వార్టర్స్లో యూపీ 55-51తో డిఫెండింగ్ చాంపియన్ సర్వీసెస్ అద్భుత విజయం సాధించింది. అర్జున్ దేశ్వాల్ 19 పాయింట్లతో యూపీ విజయంలో కీలకమయ్యాడు.
మరో క్వార్టర్స్లో మహారాష్ట్ర 53-38తో హిమాచల్ప్రదేశ్పై గెలిచి ముందంజ వేసిం ది. మహారాష్ట్ర ప్లేయర్లు అజిత్ చౌహాన్ (14), ఆదిత్య షిండే (12) రాణించారు. మిగతా క్వార్టర్స్ మ్యాచ్ల్లో రైల్వేస్తో బీహార్, తమిళనాడుతో చండీగఢ్ తలపడనున్నాయి.