హోస్టన్: సొంతగడ్డపై త్వరలో జరుగబోయే టీ20 వరల్డ్ కప్నకు ముందు ఆతిథ్య యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) సంచలన విజయాలతో దూసుకెళ్తోంది. అంతర్జాతీయ స్థాయిలో అనుభవమున్న బంగ్లాదేశ్ను వరుసగా రెండు మ్యాచ్లలో ఓడించి మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది.
హోస్టన్ వేదికగా గురువారం రాత్రి బంగ్లాదేశ్తో ముగిసిన రెండో టీ20లో ఆ జట్టు 6 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేయగా ఛేదనలో బంగ్లా 138 పరుగులకే ఆలౌట్ అయింది.