Urvashi Rautela : టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా.. వీళ్ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందనే వదంతులు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. పంత్ను డిస్టర్బ్ చేయొద్దంటూ ఆన్లైన్లో ఊర్వశిని ట్రోల్ చేసేవాళ్లు చాలామందే. అయితే.. పంత్కు కారు యాక్సిడెంట్ అయిన తర్వాత అతను త్వరగా కోలుకోవాలని ఊర్వశి సోషల్మీడియాలో పోస్టులు కూడా పెట్టింది. ఈమధ్య పంత్ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్పై బాలీవుడ్ నటి ఊర్వశి స్పందించింది.
ముంబై విమానాశ్రయంలో ఈ రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆమె ఆసక్తికర కామెంట్లు చేసింది. ‘అతను మనదేశ సంపద.. మనదేశ గౌరవం’ అని అంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
ఎరుపు రంగు డ్రెస్లో ముంబై ఎయిర్పోర్ట్కు వచ్చిన ఊర్వశిని ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. పంత్ ఈమధ్య ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన కర్రల సాయంతో నడుస్తున్న ఫొటోలను చూశారా? అన్న ప్రశ్నకు ‘అవును.. అవును’ అని ఊర్శశి బదులిచ్చింది. అంతేకాదు..మనందరి గుడ్ విషెస్ పంత్కు ఉంటాయి? అని ఒక వ్యక్తి అనగానే.. ఊర్వశి కూడా ‘నా విషెస్ కూడా ఉంటాయి’ అని చెప్పింది.
ఈమధ్యే అతనికి ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో మోకాలికి సర్జరీ చేశారు. కర్రల సాయంతో నడుస్తున్న ఫొటోలను పంత్ ఇన్స్టాలో షేర్ చేశాడు. ఆ ఫొటోలు చూసిన చాలామంది అతను తొందరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. పంత్ మళ్లీ మైదానంలోకి దిగేందుకు మరింత సమయం పట్టనుంది. దాంతో, ఈ స్టార్ ప్లేయర్ బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ, ఐపీఎల్ 16వ సీజన్కు దూరం అయ్యాడు. వన్డే వరల్డ్ కప్, టెస్టు ఛాంపియన్షిప్ వరకు అతను ఫిట్నెస్ సాధిస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. పోయిన ఏడాది రూర్కీ సమీపంలో పంత్ డ్రైవ్ చేస్తున్న కారు యాక్సిడెంట్కు గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పంత్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఉత్తరాఖండ్లోని మ్యాక్స్ ఆస్పత్రిలో కొన్నిరోజులు చికిత్స తీసుకున్నాడు.