UP vs GG : మహిళల ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్లో దారుణంగా ఓడిపోయిన గుజరాత్ జెయింట్స్ రెండో మ్యాచ్లో రాణించింది. డీవై పాటిల్ స్టేడియంలో యూపీ వారియర్స్పై 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ (46) రాణించడంతో ఆ జట్టు అంత స్కోర్ చేయగలిగింది. ఓపెనర్లు సబ్బినేని మేఘన (24), సోఫియా డంక్లే (13) స్వల్ప స్కోర్కే వెనుదిరిగారు. ఆషే గార్డ్నర్ (25), దయలాన్ మేహలత (21 నాటౌట్) చివర్లో ధాటిగా ఆడారు. హేమలత సిక్సర్లు, ఫోర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది.
దేవికా వైద్య వేసిన 17వ ఓవర్లో హర్లిన్ చెలరేగింది. తొలి నాలుగు బంతులను ఫోర్లుగా మలిచింది. దాంతో, ఆ ఓవర్లో 18 రన్స్ వచ్చాయి. అన్నాబెల్ సౌథర్లాండ్ (8), సుష్మా వర్మ (8) విఫలం అయ్యారు. యూపీ వారియర్స్ బౌలర్లలో ఎక్లెస్టోన్ దీప్తి శర్మ తలా రెండు వికెట్లు తీశారు. అంజలి సర్వాని, తహిలా మెక్గ్రాత్కు ఒక్కో వికెట్ దక్కింది.
డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్లు సోఫియా డంక్లే, మేఘన ధాటిగా ఆడి శుభారంభం ఇచ్చారు. రెండో ఓవర్లో ఇద్దరు తలా రెండు ఫోర్లు కొట్టారు. దాంతో, ఆ ఓవర్లో 17 రన్స్ వచ్చాయి. అయితే.. 34 పరుగుల వద్ద ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. డంక్లేను దీప్తి శర్మ బౌల్డ్ చేసింది. అక్కడి నుంచి గుజరాత్ వికెట్ల పతనం మొదలైంది. యూపీ వారియర్స్ బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచారు. 76 రన్స్కే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో.. గార్డ్నర్, హర్లీన్ వేగంగా ఆడి జట్టు భారీ స్కోర్కు బాటలు వేశారు.