న్యూఢిల్లీ: కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు కరోనా వైరస్ సోకిం ది. కొవిడ్-19 పరీక్షలో తనకు పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఆయన శనివారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘నేడు చేయించుకున్న కరోనా పరీక్షలో నాకు పాజిటివ్గా తేలింది. డాక్టర్ల సలహాలు తీసుకుంటున్నా. నన్ను ఇటీవల కలిసిన వారందరూ సెల్ఫ్ క్వారంటైన్లో ఉండి కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నా. నేను శారీరకంగా ఫిట్గా, క్షేమంగా ఉన్నా’ అని రిజిజు ట్వీట్ చేశారు.