Team India Squad : ఇటీవలే మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా అవతరించిన భారత జట్టు స్వదేశంలో తొలి సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 21 నుంచి శ్రీలంకతో పొట్టి ఫార్మాట్లో తలపడనుంది టీమిండియా. ఇదివరకే సిరీస్ షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ.. మంగళవారం స్క్వాడ్ను వెల్లడించింది. తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) కెప్టెన్గా.. మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు. సీనియర్లతో పాటు అండర్-19 వరల్డ్కప్లో అదరగొట్టిన జి.కమలిని (Kamalini) వికెట్ కీపర్గా, వైష్ణవీ శర్మకు బౌలర్గాచోటు లభించింది.
స్వదేశంలో జరిగిన పదమూడో సీజన్ ప్రపంచకప్లో ఆడిన సీనియర్లలో చాలామంది టీ20 సిరీస్కు ఎంపికయ్యారు. దీప్తి శర్మ, హర్లీన్ డియోల్, స్నేహ్ రానా, రేణుకా సింగ్, శ్రీ చరణిలు స్క్వాడ్లోకి రాగా.. గాయపడిన ఓపెనర్ ప్రతీకా రావల్ బదులు షఫాలీ వర్మను ఎంపిక చేశారు. స్పిన్ ఆల్రౌండర్ రాధా యాదవ్కు చోటు దక్కలేదు. అయితే.. ఇటీవలే మలేశియాలో ముగిసిన అండర్ -19 వరల్డ్కప్లో రాణించిన కమలిని, వైష్ణవీ శర్మలు ఈ సిరీస్తో టీ20ల్లో అరంగేట్రం చేయనున్నారు.
🚨 News 🚨#TeamIndia’s squad for the 5⃣-match T20I series against Sri Lanka Women announced.
More details – https://t.co/CS41IPCECP#INDvSL | @IDFCFIRSTBank pic.twitter.com/uqavBNZpEL
— BCCI Women (@BCCIWomen) December 9, 2025
భారత స్క్వాడ్ : హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, స్నేహ్ రానా, జెమీమా రోడ్రిగ్స్, షపాలీ వర్మ, హర్లీన్ డియోల్, అమన్జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్, రీచా ఘోష్(వికెట్ కీపర్), జి.కమలిని(వికెట్ కీపర్), శ్రీచరణి, వైష్ణవి శర్మ.
వరల్డ్ కప్ ఛాంపియన్గా టీమిండియా ఆడుతున్న తొలి సిరీస్ ఇది. డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 30 వరకూ జరుగబోయే ఐదు టీ20ల సిరీస్లో శ్రీలంకను ఢీకొడుతుంది భారత్. ఈ ఐదు మ్యాచ్లకు వైజాగ్, త్రివేండ్రం(తిరువనంతపురం) నగరాలు వేదిక కానున్నాయి. టీమిండియా ఈ ఏడాది జూన్లో చివరి పొట్టి సిరీస్ ఆడింది. అది కూడా ఇంగ్లండ్లో 3-2తో విజేతగా నిలిచింది హర్మన్ప్రీత్ సేన. లంక విషయానికొస్తే ఆ జట్టు మార్చిలో న్యూజిలాండ్తో ఆడిన సిరీసే ఆఖరు. ఆ సిరీస్ను ఇరుజట్లు 1-1తో సమం చేసుకున్నాయి.
🚨 News 🚨
Schedule for @IDFCFIRSTBank T20I series against Sri Lanka Women announced.
Details ▶️ https://t.co/jYCdTE8YhA#TeamIndia | #WomenInBlue | #INDvSL pic.twitter.com/wK4d5c0XLQ
— BCCI Women (@BCCIWomen) November 28, 2025
తొలి టీ20 – డిసెంబర్ 21 ఆదివారం, విశాఖపట్టణం. రెండో టీ20 – డిసెంబర్ 23 మంగళవారం, విశాఖపట్టణం. మూడో టీ20 – డిసెంబర్ 26 శుక్రవారం, తిరువనంతపురం. నాలుగో టీ20 – డిసెంబర్ 28 ఆదివారం, తిరువనంతపురం. ఐదో టీ20 – డిసెంబర్ 30, మంగళవారం, తిరువనంతపురం. టీ20 ప్రపంచకప్ సన్నద్ధతలో ఉన్న టీమిండియాకు ఈ సిరీస్ చాలా కీలకం. బాలీవుడ్ సింగర్ పలాశ్ ముచ్చల్తో పెళ్లి రద్దు చేసుకున్న మంధాన ఈ సిరీస్లో భారీ స్కోర్లతో రెచ్చిపోవాలనుకుంటోంది.