IND VS WI : వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు(Team India) ప్రయోగాలను కొనసాగిస్తోంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో యువ ఆటగాళ్లకే విరివిగా అవకాశాలిస్తోంది. భారత్, వెస్టిండీస్ మధ్య ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలోనూ మేనేజ్మెంట్ ప్రయోగాలు కొనసాగించింది. పేసర్ జైదేవ్ ఉనాద్కట్(Jaydev Unadkat)కు తుది జట్టులో చోటు కల్పించింది. టెస్టు సిరీస్లో మ్యాచ్ ఆడిన ఉనాద్కట్కు ఎట్టకేలకు చివరి వన్డేలో అవకాశం లభించింది. దాంతో, ఈ సౌరాష్ట్ర పేసర్ పదేళ్ల తర్వాత వన్డేల్లోఆడుతున్నాడు. అతను 2013లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
తొలి వన్డేలో యంగ్ గన్స్కు బ్యాటింగ్లో ప్రమోషన్ ఇచ్చిన మేనేజ్మెంట్.. రెండో మ్యాచ్లో సీనియర్లు రోహిత్ శర్మ(Rohit Sharma) విరాట్ కోహ్లీ(Virat Kohli)కి రెస్ట్ ఇచ్చింది. దీంతో బ్యాటింగ్ ఆర్డర్లో అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపించగా.. యువ ప్లేయర్లు విఫలమవడంతో ఘోర పరాజయం తప్పలేదు. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) జట్టుకు నాయకత్వం వహిస్తుండగా..
సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్
గత మ్యాచ్ ఆడిన అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ను తుది జట్టు నుంచి తప్పించారు. వారి స్థానాలను రుతురాజ్ గైక్వాడ్, జైదేవ్ ఉనాద్కట్తో భర్తీ చేశారు. మిడిలార్డర్లో కీలకంగా మారగలరని భావిస్తున్న సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్పై జట్టు యాజమాన్యం భరోసా ఉంచింది. దీంతో వీరిద్దరూ టీమ్లో చోటు నిలుపుకోగా.. టాస్ గెలిచిన విండీస్ మొదట బౌలింగ్ నిర్ణయించుకోవడంతో యంగ్ ఇండియా మొదట బ్యాటింగ్కు దిగింది.