Major League Cricket : మైక్రోసాఫ్ట్ సీఈఓ(Microsoft CEO) సత్య నాదెళ్ల(Satya Nadella)పై భారత వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ(Mukesh Ambani) పైచేయి సాధించాడు. అవును.. క్రికెట్లో ముకేశ్ జట్టు నాదెళ్ల టీమ్ను ఓడించింది. టెక్సాస్ వేదికగా గత ఆదివారం జరిగిన అమెరికా టీ20 లీగ్(America T20 League) ఫైనల్లో సత్య నాదెళ్లకు చెందిన సీటెట్ అర్కాస్(Seattle Orcas)పై ముంబై ఇండియన్స్ ఎన్వై(MI New York) జట్టు ఏడు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తద్వారా అమెరికా అరంగేట్రం టీ20 లీగ్ను ముంబై ఇండియన్స్ తమ ఖాతాలో వేసుకుంది.
ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా వెలుగొందుతున్న ముకేశ్ తన క్రికెట్ సామ్రాజ్యాన్ని అంతకంతకు విస్తరిస్తున్నాడు. ఇప్పటికే ఐపీఎల్(IPL)లో అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians) వేర్వేరు దేశాల్లో ఇదే బ్రాండ్తో సత్తాచాటుతున్నది. ముంబై ఇండియన్స్ ఎన్వై కంటే ముందు ఎమ్ఐ దక్షిణాఫ్రికా(MI South Africa), ఎమ్ఐ యూనైటెడ్ అమిరేట్స్(MI United Emirates) పేరిట అంబానీ జట్లు వేర్వేరు టీ20 లీగ్ల్లో అదరగొడుతున్నాయి.
అమెరికా టీ20 లీగ్ ట్రోఫీతో ముంబై ఇండియన్స్ ఎన్వై జట్టు
సీటెల్ అర్కాస్ జట్టులో సత్య నాదెళ్లతో పాటు ఐదుగురు బిలియనీర్లు సోమశేఖర్, సమీర్ బొడాస్, అశోక్ కృష్ణమూర్తి, సంజయ్ పార్థసారథి పెట్టుబడులు పెట్టారు. ఇదిలా ఉంటే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ విలువ ప్రస్తుతం రూ.9968 కోట్లుగా ఉంది. మిగతా జట్లతో ఇది అత్యధికం కావడం విశేషం. ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్(Chennai Super Kings), ముంబై ఇండియన్స్ ఐదు టైటిళ్లతో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే.