Marais Erasmus : అంతర్జాతీయ క్రికెట్లో ఉత్తమ అంపైర్లలో ఒకడైన మరైస్ ఎరాస్మస్(Marais Erasmus) వీడ్కోలు పలికాడు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్(ICC Elite Panel)లో సభ్యుడైన అతడు తన సుదీర్ఘ కెరీర్కు ఫుల్స్టాప్ పెడుతున్నట్టు బుధవారం ప్రకటించాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట సిరీస్ తనకు ఆఖరిదని 60 ఏండ్ల వయసున్న ఎరాస్మస్ తెలిపాడు.
‘అంపైర్గా లభించే గౌరవాన్ని, పర్యటనలను మిస్ అవుతాను. అయితే.. అంపైర్గా ఎన్నో రోజులు సేవలందించాను. ఇకపై బోరింగ్ లైఫ్ కోసం ఎదురుచూస్తున్నా’ అని ఎరాస్మస్ వెల్లడించాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఎరాస్మన్ తన సుదీర్ఘ కెరీర్లో మూడుసార్లు ‘ఐసీసీ అంపైర్ అఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నాడు. ఎరాస్మర్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఐసీసీ ఎలైట్ అంపైర్ ప్యానెల్లో దక్షిణాఫ్రికా నుంచి అడ్రియన్ హోల్డ్స్టాక్(Adrian Hold stack) ఒక్కడే మిగిలాడు.
మరైస్ ఎరాస్మస్
ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన ఎరాస్మస్ బోలాండ్ జట్టుకు ఆడాడు. అనంతరం అంపైరింగ్కు కెరీర్గా ఎంచుకున్నాడు. అతడు 2006 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్కు తొలిసారి అంపైర్గా వ్యవహరించాడు. దాదాపు 20 ఏండ్లకు పైగా అంపైర్గా సేవలందించాడు. మొత్తంగా 80 టెస్టులు, 124 వన్డేలు, 43 టీ20లకు అంపైర్గా పనిచేశాడు. అంతేకాదు మహిళల 18 టీ20 మ్యాచ్లకు కూడా ఎరాస్మస్ అంపైరింగ్ చేశాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అతడు సచిన్ టెండూల్కర్, జాక్వెస్ కలిస్, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ వంటి ఎందరో గొప్ప ఆటగాళ్లను చూశాడు.