భోపాల్: మధ్యప్రదేశ్లోని దిండోరిలో (Dindori) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరిలోని బంద్ఝర్ ప్రాంతంలో ఓ పికప్ వ్యాన్ (Pickup Vehicle) అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను షాపురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.
బాధితులు దిండోరి జిల్లాలోని షాపురా బ్లాక్లో ఉన్న అమ్హాయి దేవీ గ్రామంలో జరిగిన శ్రీమంతం వేడుకకు హాజరై సొంతూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
కాగా, ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
#WATCH | Madhya Pradesh: 14 people died and 20 injured after a pick-up vehicle lost control and overturned at Badjhar ghat in Dindori. Injured are undergoing treatment at Shahpura Community Health Centre: Vikas Mishra, Dindori Collector
(Visuals of the injured who are undergoing… pic.twitter.com/24CjMnprEb
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 29, 2024