UEFA : లివర్పూల్ ఫ్యాన్స్కు యూరోపియన్ ఫుట్బాల్ సంఘం (యూఈఎఫ్ఏ) తీపి కబురు చెప్పింది. గత ఏడాది ప్యారిస్లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ టికెట్ ధరను చెల్లిస్తామని తెలిపింది. అంతేకాదు ఫైనల్ మ్యాచ్ సమయంలో స్టేడియం బయట జరిగిన గొడవలు, అల్లర్లకు తామే కారణం అని ప్రకటించింది. ‘ఆ రోజు లివర్పూల్ క్లబ్ ఫ్యాన్స్కు ఎదురైన పరిస్థితికి చింతిస్తున్నాం.
అందుకని మ్యాచ్ టికెట్ ధరను వాళ్లకు చెల్లించాలని నిర్ణయించుకున్నాం’ అని యూఈఎఫ్ఏ జనరల్ సెక్రటరీ థియోడోర్ థియోడొరిడిస్ వెల్లడించాడు. ఫైనల్ మ్యాచ్కు 19,618 టికెట్లు అమ్ముడుపోయాయి. టికెట్ ధర రూ.6 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంది.
స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో 2022 మే 28న రియల్ మాడ్రిడ్, లివర్పూల్ మధ్య ఫైనల్ మ్యాచ్ 36 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. దాంతో అగ్రహించిన వేలాది మంది లివర్పూల్ క్లబ్ అభిమానులు ఆందోళనకు దిగారు. వాళ్లను చెదరగొట్టేందుకు ఫ్రాన్స్ పోలీసులు టియర్ గ్యాస్ వాడారు. మహిళలు, చిన్న పిల్లలు అని కూడా చూడకుండా అందరిపైనా టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే.. ఈ సంఘటనకు మెర్సేసైడ్ క్లబ్ ఫ్యాన్స్ కారణం అని యూరోపియన్ ఫుట్బల్ సంఘం మొదట్లో తెలిపింది. కానీ, స్వతంత్ర దర్యాప్తు తర్వాత ఆ ఘటనకు తామే కారణం అని తెలిపిన ఆ సంఘం లివర్పూల్ అభిమానులకు క్షమాపణలు చెప్పింది.