కరోనాతో ఇద్దరిని కోల్పోయిన భారత మహిళా క్రికెటర్ వేద
న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా ఇటీవల తల్లి చెవులాంబను కోల్పోయిన వేద.. ఇప్పుడు సోదరి వత్సల (45)ను కోల్పోయింది. మహమ్మారి బారినపడి గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న వత్సల.. బుధవారం రాత్రి చిక్మాగళూరులోని ఓ ప్రైవేట్ దవాఖానాలో తుదిశ్వాస విడిచారు. తల్లి మృతి సమయంలోనే సోదరి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉందని.. ఆమె కోసం ప్రార్థిస్తున్నామని ట్విట్టర్లో పేర్కొన్న వేద.. ఆమె కూడా మృతిచెందడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.