బెంగుళూరు: బెంగుళూరులో వర్షం కురుస్తోంది. దీంతో కివీస్, భారత్(IND Vs NZ) మధ్య ఇవాళ ప్రారంభం కావాల్సిన టెస్టు మ్యాచ్ ఆలస్యం అవుతోంది. ఇప్పటికే తొలి రెండు సెషన్లు ముగిశాయి. చిన్నస్వామి స్టేడియంలో ఇంకా కొన్ని కవర్స్ అలాగే ఉన్నాయి. బెంగుళూరులో ఉదయం నుంచి అడపాదడపా జల్లు కురుస్తోంది. టీ టైం కూడా పూర్తి కావడంతో.. ఇవాళ ఆట జరిగేది అనుమానంగా ఉన్నది. మరో వైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్.. ఇండోర్ ప్రాక్టీస్ చేశారు. టీ బ్రేక్ తర్వాత .. పిచ్ను పరిశీలించిన అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
🚨 Update from Bengaluru 🚨
Day 1 of the 1st #INDvNZ Test has been called off due to rain.
Toss to take place at 8:45 AM IST on Day 2
Start of Play: 9:15 AM IST #TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/RzmBvduPqr
— BCCI (@BCCI) October 16, 2024
It’s still raining here in Bengaluru 🌧️
The wait continues ⏳
The first session has unfortunately been washed out.
Match Centre – https://t.co/FS97Llv5uq#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/BUDWJ8Mw1v
— BCCI (@BCCI) October 16, 2024
ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన రెండు మ్యాచ్ల సిరీస్ ను కైవసం చేసుకున్న రోహిత్ సేన.. న్యూజిలాండ్పైనా అదే దూకుడును ప్రదర్శించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గత కొన్నాళ్ల ప్రదర్శన ఆధారంగా చూసినా ప్రస్తుత ఫామ్ పరంగా చూసుకున్నా.. ఈ సిరీస్లో టీమ్ఇండియానే తిరుగులేని ఫేవరేట్గా ఉంది. శుభ్మన్ గిల్, యశస్వీ జైస్వాల్ ఫామ్లో ఉండటం.. టెస్టులలో పునరాగమనం తర్వాత వికెట్ కీపర్ రిషభ్ పంత్ దూకుడు.. స్పిన్ ఆల్రౌండర్లు అశ్విన్, జడేజా ఆల్రౌండ్ షో.. బుమ్రా నేతృత్వంలోని పేస్ బలగం.. ఇలా అన్ని విభాగాల్లోనూ భారత్ దుర్భేద్యంగా ఉంది.
కానీ కివీస్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. గత ఐదు టెస్టులలో ఆ జట్టు 4 మ్యాచ్లలో ఓడటం.. ప్రధాన బ్యాటర్లంతా ఫామ్లేమితో సతమతమవుతుండగా బౌలర్ల ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఆ జట్టు భారత్ను ఎలా అడ్డుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. న్యూజిలాండ్తో సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేస్తే ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకునే అవకాశముంది.