తిరుమల : అమెరికాలోని బర్మింగ్హామ్ నగరంలో జరిగిన ప్రపంచ పోలీస్(Police ) , ఫైర్ గేమ్స్ ( Fire Games) – 2025 పోటీల్లో టీటీడీ (TTD) సెక్యూరిటీ విజిలెన్స్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు క్రీడా ప్రతిభను ప్రదర్శించి అద్భుత విజయాలు సాధించారు. 45 సంవత్సరాల పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్ పోటీలో టీటీడీ విజీవో ఎ.సురేంద్ర స్వర్ణ పతకాన్ని (Gold medal ) గెలుచుకోగా, 55 సంవత్సరాల పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్ పోటీలో వీజీవో ఎన్టీవీ రామ్ కుమార్ కాంస్య పతకాన్ని (Bronze Medals ) సాధించారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో జె.శ్యామలరావు విజేతలను అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల పోలీస్, ఫైర్ విభాగాల నుంచి 9వేల మంది అథ్లెట్లు పాల్గొన్న పోటీల్లో టీటీడీ అధికారుల విజయాలు దేశానికే గర్వకారణమని చైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవో వీ.వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.