పటియాల: భారత మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు కరోనా వైరస్ సోకింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్కు గాయం వల్ల దూరమైన హర్మన్ సోమవారం స్వల్ప జ్వరం రావడంతో పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమె హోం ఐసొలేషన్లో ఉందని హర్మన్ సన్నిహితులొకరు తెలిపారు. కాగా దాదాపు 12 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడిన భారత జట్టు.. దక్షిణాఫ్రికా చేతిలో వన్డే, టీ20 సిరీస్లను కోల్పోయిన విషయం తెలిసిందే.