కాన్పూర్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండవ రోజు భోజన విరామ సమాయానికి ఇండియా 8 వికెట్లు కోల్పోయి 339 రన్స్ చేసింది. ఇండియన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేయగా.. కివీస్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ అయిదు వికెట్లు తీశాడు. 105 రన్స్ చేసి ఔటైన అయ్యర్.. అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేసిన 16వ ఇండియన్ క్రికెటర్గా నిలిచాడు. అయితే వికెట్లు కుప్పకూలే ప్రమాదం ఉందనుకున్న దశలో.. లోయర్ ఆర్డర్లో అశ్విన్ ఆదుకున్నాడు. అశ్విన్ 58 బంతుల్లో 38 రన్స్ చేసి క్రీజ్లో ఉన్నాడు. ఇవాళ ఉదయం 258 పరుగుల వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా తొలి సెషన్లో మరో 81 రన్స్ జోడించింది. జడేజా 50 రన్స్ చేసి ఔటయ్యాడు. కివీస్ బౌలర్ సౌథీ తొలి ఇన్నింగ్స్లో చెలరేగాడు. 28 ఓవర్లే వేసి 69 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీసుకున్నాడు. జేమీసన్ ఖాతాలో మూడు వికెట్లు పడ్డాయి.