న్యూఢిల్లీ: ఇండియాలో వన్డే వరల్డ్కప్ ఫీవర్ అప్పుడే మొదలైంది. అక్టోబర్లో జరిగే ఆ ఈవెంట్ కోసం టికెట్లు అమ్మే తేదీలను ఐసీసీ ప్రకటించింది. ఆ మెగా టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్థాన్(India Vs Pakistan) మ్యాచ్కు టికెట్లు అమ్మే తేదీని కూడా ప్రకటించారు. అక్టోబర్ 14వ తేదీన జరగనున్న ఆ మ్యాచ్కు చెందిన టికెట్లను సెప్టెంబర్ మూడవ తేదీన అమ్మనున్నారు. అహ్మాదాబాద్లోని మోదీ స్టేడియంలో ఆ హై థ్రిల్లర్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే.
క్రికెట్ వరల్డ్ కప్ కోసం ఆగస్టు 25వ తేదీ నుంచి టికెట్ల అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. అయితే ఇండియా వార్మప్ మ్యాచ్లకు ఆగస్టు 30వ తేదీ నుంచి టికెట్లు అమ్ముతారు. ఇక ఇండియా అసలైన మ్యాచ్ కోసం మాత్రం ఆగస్టు 31వ తేదీ నుంచి టికెట్ల అమ్మకాలు స్టార్ట్ అవుతాయి. టికెట్లు కావాలనుకునే వాళ్లు.. క్రికెట్ వరల్డ్కప్ వెబ్సైట్లో ఆగస్టు 15వ తేదీ నుంచి రిజిస్టర్ చేసుకోవాలి. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్కు చెందిన టికెట్లను సెప్టెంబర్ 15వ తేదీన అమ్మనున్నారు.
Mark your calendars 🗓
The dates for the sale of #CWC23 tickets are out 🤩
Don't forget to check out the updated schedule 👉 https://t.co/sEwFD12Zc6 pic.twitter.com/atop78DOeV
— ICC Cricket World Cup (@cricketworldcup) August 10, 2023