మౌంట్ మాంగనీ: న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ 1-1తో ‘డ్రా’గా ముగిసింది. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్లో న్యూజిలాండ్ 17 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్ధతిలో) బంగ్లాదేశ్ను చిత్తుచేసింది. మొదట బంగ్లాదేశ్ 19.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. నజ్ముల్ (17) టాప్ స్కోరర్. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 14.4 ఓవర్లలో 95/5తో నిలిచిన సమయంలో మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోగా.. అప్పటికే ముందంజలో ఉన్న కివీస్ను విజేతగా ప్రకటించారు.