టోక్యో: ఒలింపిక్స్లో మన మెన్స్ హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్లో మెడల్ గెలిచిన మన్ప్రీత్ సేన.. మరోసారి జాతీయ క్రీడను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. జర్మనీపై 5-4తో గెలిచి బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. ఈ అద్భుతమైన విజయంపై కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ స్పందించాడు. ఇండియాలోని కొవిడ్ యోధులకు ఈ మెడల్( Hockey Medal )ను అంకితమిస్తున్నట్లు చెప్పాడు. ఈ చారిత్రక విజయం సాధించిన తర్వాత టీమంతా భావోద్వేగానికి గురైంది. మ్యాచ్ ముగియగానే కెప్టెన్ మన్ప్రీత్ సహా టీమ్ అంతా ఆనందం పట్టలేక కంటతడి పెట్టింది.
ఈ కీలకమైన మ్యాచ్లో ఇండియా తరఫున సిమ్రన్జీత్ సింగ్ రెండు గోల్స్ చేయగా.. హార్దిక్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్ తలా ఒక గోల్ చేశారు. ఒలింపిక్స్ హాకీలో రికార్డు స్థాయిలో 8 గోల్డ్ మెడల్స్ గెలిచిన టీమిండియాకు ఇది మూడో బ్రాంజ్ మెడల్. ఇంతకుముందు 1968, 1972 ఒలింపిక్స్లో మెడల్స్ సాధించింది.