ముంబై: ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు పడగొట్టి చరిత్రకెక్కిన న్యూజిలాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్.. ఈ ఫీట్తో తన జీవితం మారిపోతుందో లేదో స్పష్టంగా చెప్పలేనని అంటున్నాడు. ముంబైలో పుట్టి పెరిగి.. కుటుంబ సభ్యులతో కలిసి న్యూజిలాండ్లో స్థిరపడ్డ 33 ఏండ్ల అజాజ్.. టీమ్ఇండియాతో వాంఖడే వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో పదికి పది వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అజాజ్ మంగళవారం మాట్లాడుతూ.. ‘నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. ఈ ఫీట్తో జీవితం మారుతుందో లేదో తెలియదు. ఇప్పటికి 11 టెస్టులే ఆడా. కెరీర్ ముగిసే సరికి న్యూజిలాండ్ తరఫున 80-90 టెస్టులు ఆడాలనుకుంటున్నా. అందుకు ఇది ప్రేరణగా నిలుస్తుంది’ అని అన్నాడు.