మొహాలీ: అఫ్గానిస్థాన్తో తొలి టీ20 మ్యాచ్లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్శర్మ రనౌట్పై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇన్నింగ్స్ రెండో బంతికే మరో ఓపెనర్ శుభ్మన్ గిల్తో సమన్వయ లోపంతో రోహిత్ రనౌట్గా వెనుదిరిగాడు. దీనిపై మ్యాచ్ వ్యాఖ్యాత స్పందిస్తూ ‘రోహిత్ షాట్ను గిల్ అలా చూస్తుండిపోయాడు.
అదే సమయంలో రన్ కోసం రోహిత్ సగం పిచ్ దాటేశాడు. ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో వికెట్ కోల్పోవాల్సి వచ్చింది’ అని అన్నాడు.