బ్లూమ్ఫాంటైన్: అండర్-19 ప్రపంచకప్లో యువ భారత క్రికెట్ జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. ఇప్పటికే సూపర్ సిక్స్కు అర్హత సాధించిన యంగ్ఇండియా.. ఆదివారం 201 పరుగుల తేడాతో అమెరికాను చిత్తుచేసింది.
మొదట యువభారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (108; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) శతక్కొట్టగా.. ముషీర్ ఖాన్ (73) రాణించాడు. అనంతరం అమెరికా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. మన బౌలర్లలో నమన్ తివారీ 4 వికెట్లు పడగొట్టాడు. అర్షిన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.