దుబాయ్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహించనున్నట్లు ఐసీసీ బుధవారం తెలిపింది. వంద టెస్టులకు ఆతిథ్యమిచ్చిన చారిత్రక ఓవల్ మైదానంలో మెగా మ్యాచ్ జరుగనుండగా.. జూన్ 12ను ‘రిజర్వ్ డే’గా ప్రకటించారు. 2021లో తొలిసారి జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాపై న్యూజిలాండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.