వెల్లింగ్టన్: లెగ్స్పిన్నర్ ఇష్ సోధి (3/24) సత్తాచాటడంతో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20లో న్యూజిలాండ్ ఏడు వికెట్లతో గెలిచి 3-2తో సిరీస్ను ఒడిసిపట్టింది. ఆదివారం చివరి పోరులో మొదట ఆసీస్ 8 వికెట్లకు 142 పరుగులు చేసింది. వేడ్ (44), ఫించ్ (36) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో మార్టిన్ గప్టిల్ (46 బంతుల్లో 71; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), కాన్వే (36), ఫిలిప్స్ (34 నాటౌట్) అదరగొట్టడంతో న్యూజిలాండ్ 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 143 పరుగులు చేసింది.