పుణె: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై లయన్స్ టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో చెన్నై 8-3 తేడాతో పుణేరి పల్టన్పై అలవోక విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో గోవా చాలెంజర్స్తో చెన్నై తలపడుతుంది.
సెమీస్ విషయానికొస్తే.. పురుషుల సింగిల్స్లో చెన్నై ప్లేయర్ బెనెడిక్ట్ డుడా 11-5, 11-7, 11-6తో ఒమర్ అసర్పై వరుస గేముల్లో విజయం సాధించాడు. మహిళల సింగిల్స్లో యాంగ్జి లు 3-11, 11-8, 11-7తో హనా మటెలోవాపై, మిక్స్డ్ డబుల్స్లో శరత్, యాంగ్జి జోడీ 11-4, 9-11, 11-6తో మానుశ్, హనా ద్వయంపై, పురుషుల సింగిల్స్లో శరత్ కమల్ 5-11, 11-5తో మానుశ్ షాతో పోరును డ్రా చేసుకున్నాడు. చివరిసారి 2019లో జరిగిన లీగ్లో చెన్నై టైటిల్ విజేతగా నిలిచింది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా యూటీటీ లీగ్కు బ్రేక్ పడింది.