ముంబై: వన్డే ప్రపంచకప్లో టాప్-7లో నిలిచిన జట్లు 2025లో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి నేరుగా అర్హత సాధించనున్నాయి. ఆతిథ్య హోదాలో పాకిస్థాన్కు బెర్తు ఖాయం కాగా, టోర్నీలో ఎనిమిది జట్లు పోటీపడనున్నాయి. 2025లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ కోసం 2021లో ఐసీసీ ఆమోదముద్ర వేసింది.
పలు మెగాటోర్నీల ఆతిథ్య వేదికలను ఐసీసీ ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది అమెరికా-వెస్టిండీస్ సంయుక్త ఆతిథ్యంలో టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగనుంది.