IND vs BAN | మీర్పూర్: భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో వన్డే ‘టై’గా ముగిసింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ ‘టై’ కాగా.. మూడు మ్యాచ్ల సిరీస్లో రెండు జట్లూ ఒక్కో మ్యాచ్ నెగ్గడంతో సిరీస్ సమమైంది. మొదట బంగ్లా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఓపెనర్ ఫర్జానా హక్ (107) సెంచరీతో రాణించగా.. షమీమా సుల్తానా (52) హాఫ్సెంచరీతో ఆకట్టుకుంది. భారత బౌలర్లలో స్నేహ్రాణా 2 వికెట్లు పడగొట్టింది.
అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 49.3 ఓవర్లలో సరిగ్గా 225 పరుగులకు ఆలౌటైంది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన (59), హర్లీన్ డియోల్ (77) అర్ధశతకాలు సాధించారు. ఒక దశలో 212/6తో విజయానికి చేరువైన టీమ్ఇండియా.. 19 బంతుల్లో 10 పరుగులు చేయలేక చివరకు మ్యాచ్ను ‘టై’గా ముగించింది. జెమీమా రోడ్రిగ్స్ (33 నాటౌట్) క్రీజులో ఉన్నా ఫలితం లేకపోయింది. కాగా.. కెప్టెన్ హర్మన్(14) ఔటైన తీరు వివాదాస్పదమైంది. మ్యాచ్ అనంతరం హర్మన్ స్పందిస్తూ ఈ టూర్లో అంపైరింగ్ తీరు పూర్తిగా నిరాశ పరిచిందని పేర్కొంది.