India Vs SA ODI |దక్షిణాఫ్రికాపై జరుగుతున్న తొలి వన్డేలో 250 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియా తడబాటుకు గురైంది. నిలకడగా ఆడటంలో ఓపెనర్లు ఒత్తిడికి గురవుతున్నారు. ఆరో ఓవర్లో పావెల్ వేసిన తొలి బంతికి కెప్టెన్ శిఖార్ ధావన్ బౌల్డయి పెవిలియన్ బాట పట్టాడు. అంతకుముందు మూడో ఓవర్ నాలుగో బంతికి ఓపెనర్ శుభ్మన్ గిల్.. దక్షిణాఫ్రికా బౌలర్ రబడా చేతిలో బౌల్డయ్యాడు. అప్పటికి టీం ఇండియా స్కోర్ కేవలం ఎనిమిది పరుగులే.
అంతకుముందు నిర్ణీత 40 ఓవర్లు పూర్తయ్యే సరికి సఫారీలు నాలుగు వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేశారు. ఐదో వికెట్ భాగస్వామ్యానికి డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసిన్ 139 పరుగులు జత చేశారు. డీకాక్ ఔటైన తర్వాత దూకుడుగా ఆడిన క్లాసిన్ పరుగుల వేగం పెంచాడు. డేవిడ్ మిల్లర్ 63 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. అలాగే క్లాసిన్ కూడా 65 బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్సర్లతో 74 పరుగులు చేశాడు.
మరోవైపు టీం ఇండియా ఆటగాళ్ల నిర్లక్ష్యం కూడా ఫీల్డింగ్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఫలితంగా మిల్లర్, క్లాసిన్లకు పలు దఫాలు లైఫ్లైన్లు లభించాయి. దీంతో వారిద్దరూ చెలరేగిపోయారు. వారి జోడీని విడదీసేందుకు టీం ఇండియా బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.