భారత గడ్డపై వన్డే వరల్డ్కప్ మరో ఐదు రోజుల్లో షురూ కానుంది. ఈ మెగా టోర్నీలో చాంపియన్గా నిలిచిన జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్మనీ దక్కనుంది. విజేతకు రూ.33 కోట్లు, రన్నరప్ టీమ్కు రూ.16.35 కోట్లు ఇస్తామని ఐసీసీ ఈమధ్యే ప్రకటించింది. దాంతో, అమ్మో అన్ని కోట్లా? అని చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే.. వరల్డ్కప్, బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ కంటే రెండు రెట్లు నగదు బహుమతి అందించే క్రికెట్ టోర్నీ ఉందనే విషయం తెలుసా..? క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకూ రికార్డు ప్రైజ్మనీ ప్రకటించిన టోర్నీ అదే. ఆ పోటీల్లో గెలిచిన జట్టుకు రికార్డు స్థాయిలో రూ.87 కోట్ల నగదు బహుమతి ఇచ్చారు. ఇంతకు ఆ టోర్నీ పేరు ఏంటంటే.. స్టాన్ఫర్డ్ సూపర్ సిరీస్.
2008లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన దేశవాళీ టీ20 క్రికెట్ మ్యాచ్ల సిరీస్. ఈ టోర్నమెంట్ను ఇంగ్లండ్ కుబేరుడు స్టాన్ఫర్డ్ స్పాన్సర్ చేశాడు. ఇందులో ఇంగ్లండ్ జాతీయ జట్టు, స్టార్లతో నిండిన కరీబియన జట్టు పోటీ పడ్డాయి. విజేతగా నిలిచిన కరీబియన్ జట్టు భారతీయ కరెన్సీలో అక్షరాల రూ.87 కోట్లు అందుకుంది. అదే ఏడాది టీ20 ప్రపంచకప్ విజేతగా అవతరించిన టీమ్ఇండియాకు స్టాన్ఫర్డ్ సిరీస్లో ఆడాల్సిందిగా ఆహ్వానం అందింది. కానీ, అప్పుడే ఐపీఎల్ ప్రారంభం కావడంతో మనోళ్లు ఆ టోర్నీ వైపు కన్నెత్తి చూడలేదు. అయితే.. అలెన్ స్టాన్ఫర్డ్ ఆర్థిక నేరస్థుడిగా జైలుకు వెళ్లాడు. అతడితో పాటే ఆ సిరీస్ కథ కూడా ముగిసింది.