హైదరాబాద్, ఆట ప్రతినిధి: యూటీటీ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో తెలంగాణ ప్యాడ్లర్ల జోరు కొనసాగుతున్నది. మొయినాబాద్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ అండర్-13 బాలికల విభాగంలో తెలంగాణ ప్లేయర్ వెంకట మహిమ కృష్ణ 3-2తో సంగేల్కర్ (మహారాష్ట్ర)పై విజయం సాధించింది.
బాలుర అండర్-13 విభాగంలో ఆర్.అగర్వాల్ (ఢిల్లీ) 3-1తో అరుణేశ్ (పాండిచ్చెరి)పై గెలుపొందాడు. అం డర్-11 బాలికల విభాగంలో ఎస్.చక్రవర్తి (పశ్చిమ బెంగా ల్) 3-1తో వేద (పాండిచ్చెరి)పై, బాలుర ఈవెంట్లో ఆరవ్ మంగేశ్ (కర్ణాటక) 3-1తో ప్రభు (గోవా)పై గెలుపొందారు.