కుమమోటొ : జపాన్ మాస్టర్స్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టిలకు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. టాప్ సీడ్గా బరిలోకి దిగిన సాత్విక్-చిరాగ్ మంగళవారం జరిగిన మ్యాచ్లో 21-16, 18-21, 16-21 స్కోరుతో చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ 21వ ర్యాంక్ జోడి లు చింగ్ యావొ-యాంగ్ పొ హాన్ చేతిలో ఓటమి చవిచూశారు.
గత యేడాది ఫ్రెంచ్ ఓపెన్లో చైనీస్ తైపీ జోడీని ఓడించిన భారత జోడి అదే జోరు కనబరచలేకపోయారు. పలుమార్లు ఆధిక్యం చేతులు మారిన నేపథ్యంలో ఎట్టకేలకు తైపీ జోడి గేమ్ను గెలుచుకుని సమఉజ్జీగా నిలిచింది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో ఆరు పాయింట్లవరకు నువ్వానేనా అన్నట్టు సాగినా& ఆపై తైపీ జోడికి ఎదురులేకపోయింది. సింగిల్స్లో ప్రణయ్, లక్ష్య సేన్, ప్రియాంశు రజవత్, పివి సింధు బుధవారం తమ పోరును ప్రారంభించనున్నారు.