వైట్ ట్రై సిటీ(వియత్నాం): ఏఎఫ్సీ అండర్-20 ఏషియన్ క్వాలిఫయర్స్లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. రౌండ్-1లో భాగంగా జరిగిన మ్యాచ్లో భారత్ 7-0తో సింగపూర్పై ఘన విజయం సాధించింది. మ్యాచ్ మొదలైన తొలి 30 నిమిషాల్లోనే ఏకంగా ఆరు గోల్స్ ఖాతాలో వేసుకుని మ్యాచ్పై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించారు.
మ్యాచ్లో యువ భారత్ తరఫున అపర్ణ నర్జారీ(7ని, 12ని), సుమతి కుమారి(10ని), అనితా కుమారి(17ని, 31ని), అస్తమ్ ఓరాన్(24ని), కాజోల్ డిసౌజా(89ని) గోల్స్ చేశారు. బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకున్న యువ భారత్ వరుస విరామాల్లో గోల్స్ చేసి మ్యాచ్లో ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది.